top of page

🔸వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు🚆💥

సోమవారం ఉదయం వందే భారత్‌ రైలు భోపాల్‌ నుంచి ఢిల్లీ బయలు దేరింది. రైలు కుర్వాయి స్టేషన్ వద్దకు రాగానే బ్యాటరీ నుంచి మంటలు చెలరేగాయి.

ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే సమాచారాన్ని లోకో పైలట్‌కు అందించారు. దీంతో రైలును అక్కడే నిలిపివేశారు. ఈ క్రమంలో అగ్నిమాపక దళం అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని.. ఎలాంటి గాయాలు కాలేదని ఇండియన్ రైల్వే ప్రకటించింది. 🚆💥🔴

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page