top of page

🌟 వావ్ !! మెగా కోడలికి గ్రేట్ హానర్.. 🎉

🌍 తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను మెగా కోడలు ఉపాసన కొణిదెల కలిశారు. ఫిబ్రవరి 01 రాజ్‌ భవన్‌కు వెళ్లిన ఉపాసన అక్కడ గవర్నర్‌కు ప్రత్యేక జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా గిరిజనుల కోసం గవర్నర్‌ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఉపాసన కొనియాడారు. 🙌

గిరిపుత్రుల అభివృద్ధి, సంక్షేమ కోసం చేస్తున్న గవర్నర్‌ తమిళి సై చేస్తున్న పనులు నా మనసును కదిలించాయని ఉపాసన పేర్నొన్నారు. 🌱 మీరు చేస్తున్న ఈ పనులకు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ గవర్నర్‌ను కలిసిన ఫొటోలను తన ట్విట్టర్‌లో షేర్‌ చేసుకున్నారు ఉపాసన. 📸 ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాగా తెలంగాణలోని పలు జిల్లాల్లోని గిరిజన గ్రామాలను గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ దత్తత తీసుకున్నారు. 🌳 తెలంగాణ రాజ్ భవన్ తరుపున నాగర్ కర్నూలు జిల్లాలో 6 చెంచు గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్న తమిళి సై అక్కడ తరచూ పర్యటిస్తున్నారు. నిధులు కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. 🙏 ముఖ్యంగా విద్య, వైద్యం వంటి మౌలిక వసతులును కల్పిస్తూ గిరిపుత్రుల జీవన ప్రమాణాలను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను కలిసి మరీ ప్రశంసలు తెలిపారు ఉపాసన. 🌈

bottom of page