top of page

రేప్‌ చేసి చంపేసిన వాళ్లను మైనర్లని ఎలా అంటారు.?


ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది. నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల చిన్నారిని ముగ్గురు మైనర్లు అతి దారుణంగా హత్యాచారం చేసి.. అనంతరం శవం కూడా దొరకకుండా చేశారు. మొదట ఖననం చేశామని, తర్వాత హంద్రీ కాల్వలో పడేశామని.. చెప్పారు. 3 రోజుల పాటు కాల్వ అంతా గాలించినా ఆ చిన్నారి ఆచూకీ దొరకలేదు. అయితే ఈ దారుణ ఘటన తెలుగు టూ స్టేట్స్లోనే కాదు.. సౌత్ ఇండియా అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఈ ఘటనపైనే తాజాగా యాంకర్ రష్మి కాస్త ఘాటుగా రియాక్టైంది. ఇంత కిరాత ఘటనకు కారణమైన వారిని మైనర్లని ఎలా అంటారని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసింది.

వాళ్లు పెద్ద వాళ్లలా హత్యా చారం చేయగలిగితే.. శిక్ష కూడా పెద్ద వాళ్ల లాగే పడాలని ట్వీట్ చేసింది రష్మిక. అంతేకాదు వాళ్లు చేసిన తప్పుకు ఏ మాత్రం పశ్చాత్తాపo పడటం లేదు కాబట్టి.. వాళ్లు కచ్చితంగా మైనర్లలలా ఆలోచించడం లేదంటూ తన ట్వీట్లో పేర్కొంది. మైనర్లు అనే నెపంతో వాళ్లు తక్కువ శిక్షతో బయటపడడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ.. తన ఓపీనియన్ను తన ట్వీట్లో రాసుకొచ్చింది రష్మి. కేవలం రాయడమే కాదు… ఈ ట్వీట్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు, ఏపీ సీఎంవోకు ట్యాగ్ చేసింది.

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page