top of page

🏛👥 కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో దొరికిన డబ్బుపై అమిత్ షా ఏమన్నారంటే..?

💼 కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుపై జరిగిన దాడిలో ఇప్పటివరకు రూ.200 కోట్లకుపైగా నగదు లభించడంపై కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. తాను చాలా ఆశ్చర్యపోయానంటూ పేర్కొన్నారు.

స్వాతంత్రం వచ్చిన తర్వాత ఓ ఎంపీ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. కోట్లాది రూపాయలు దొరికాయి.. కానీ మొత్తం ఇండియా కూటమి ఈ అవినీతిపై మౌనంగా ఉందంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వారి స్వభావంలో అవినీతి ఉంది.. JDU, RJD, DMK, SP అందరూ మౌనంగా కూర్చున్నారు.. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం చేశారో ఇప్పుడు అర్థమైంది.. ఏజన్సీలు దుర్వినియోగం అవుతున్నాయని.. తమ అవినీతి రహస్యాలన్నీ బయటపడతాయనే భయం వారి మనసులో ఉండడంతో వారు ఇలాంటి వారిని ప్రొత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. 🤐💰🇮🇳


Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page