top of page

🌊🌍 తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ మొదలైన జల వివాదం..

🌊🌍 తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నాగార్జున సాగర్ లోని కృష్ణ జలాల కేంద్రంగా మరోసారి రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం తలెత్తింది. సాగర్ జలాల వాడకం విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నాయి. ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు కృష్ణ బేసిన్ లోని ఆల్మట్టి, నారాయణపూర్, జూరాలకు భారీగా వరద రావడంతో పూర్తిస్థాయికి చేరుకున్నాయి. కానీ శ్రీశైలంకు కొంత నీరు వచ్చి చేరింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం లేదు. దీంతో నాగార్జునసాగర్ జలాల వాడకంపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

🌊🏞️ గతేడాది ఏపీకి కేటాయించిన నీటి వాటాకు మించి 51.745 టీఎంసీల కృష్ణ జలాలను వినియోగించిందని తెలంగాణ సర్కార్ ఆరోపించింది. సాగర్‌ కుడి కాల్వ కింద వార్షిక తాగునీటి అవసరాలు 2.84 టీఎంసీలుమాత్రమే కృష్ణా రివర్ బోర్డు కేటాయించిందని, తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ లోని 5 టీఎంసీల నీళ్లను కేటాయించాలని గత నెలలో ఏపీ కోరడం పట్ల లేఖలో తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. 2022-23లో 205 టీఎంసీలను, 34:66 నిష్పత్తిలో 51 టీఎంసీలను ఏపీ ఎక్కువగా వాడుకుందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. అదనంగా వినియోగించుకున్న 51టీఎంసీలను ఈ సంవత్సరపు ఏపీ నీటి కోటా నుంచి మినహాయించాలని బోర్డును తెలంగాణ డిమాండ్ చేస్తోంది. త్వరలో జరగనున్న త్రిసభ్య కమిటీ సమావేశంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నీటి కేటాయింపులు చేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును తెలంగాణ కోరింది.

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page