top of page

బీఆర్ఎస్ కార్పొరేటర్‌పై దాడి..పచ్చి బూతులు తిడుతూ..🚨

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్‌పై మంగళవారం (మార్చి 12) రాత్రి దాడి జరిగింది. కార్పొరేటర్ దేదీప్య రావుపై స్థానిక మహిళలు దాడికి పాల్పడ్డారు. గత రాత్రి ఆమె కారును అడ్డగించిన కొందరు మహిళలు పచ్చి బూతులు తిడుతూ.. దాడి చేసారు. కారు డోర్ తీసి మరీ.. పిడిగుద్దులు కురిపించారు. కారు డ్రైవర్ అడ్డుకునే ప్రయత్నం చేసినా.. మహిళలు వినిపించుకోలేదు.అయితే డివిజన్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదమే దాడికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనలో కార్పొరేటర్ దేదీప్య రావుకు స్వల్ప గాయాలు కాగా.. ఆమెను సన్నిహితులు ఆసుపత్రికి తరలించారు. అనంతరం తన భర్త విజయ్ ముదిరాజ్‌తో కలిసి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన దేదీప్య దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ దాడి వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని ఆమె ఆరోపించారు. తనపై దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరారు.



bottom of page