దక్షిణాది ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇంట పెళ్లి సందడి షురు అయ్యింది. కుటుంబ సభ్యులందరూ పనుల్లో బిజిబిజీగా ఉంటున్నారు. మరోవైపు కాబోయే పెళ్లికూతురు ఇంటికెళ్లి మరీ సెలబ్రిటీలను ఆహ్వానిస్తోంది. తమ పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరుతోంది
ముంబైకు చెందిన బిజినెస్ మెన్ నికోలయ్ సచ్దేవ్తో వరలక్ష్మీ ఏడడుగులు నడవనుంది. ఈ ఏడాది మార్చిలో వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది.
జూలై 2న థాయ్ల్యాండ్ వేదికగా వరలక్ష్మి- నికోలయ్ సచ్ దేవ్ తో పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక పెళ్లి పనుల్లో భాగంగా ఇటీవల తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ కు వెళ్లి వివాహ ఆహ్వాన పత్రిక అందించింది వరలక్ష్మి శరత్ కుమార్. ఆమె వెంట తండ్రి రాధిక శరత్ కుమార్, రాధిక కూడా ఉన్నారు.
తాజాగా తమిళ నాడు సీఎం స్టాలిన్ కుటుంబ సభ్యులను తమ పెళ్లికి ఆహ్వానించారు వరలక్ష్మి కుటుంబ సభ్యులు. తమిళనాడు సీఎం ఎమ్కె స్టాలిన్, డీఎంకే ఉప ప్రధానకార్యదర్శి కనిమొళిని కలిసి వెడ్డింగ్ కార్డ్స్ అందజేశారు.
అలాగే హీరో కమల్ హాసన్ ను కలిసి పెళ్లి పత్రిక అందించింది వరలక్ష్మి. ఈ ఫొటోలను ఆమెనే సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా.. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి