top of page

ఉదయ్ కిరణ్ మళ్లీ వస్తున్నాడు..? 🎬

ఒకప్పుడు ప్రేమకథా చిత్రాలకు ఆయనే కేరాఫ్ అడ్రస్. వరుసగా హిట్ చిత్రాల్లో నటించి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన హీరో. కానీ చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని అభిమానులకు తీరని బాధను మిగిల్చారు.


తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే హీరో ఉదయ్ కిరణ్. బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకపోయినా నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్న నటుడు. ఒకప్పుడు ప్రేమకథా చిత్రాలకు ఆయనే కేరాఫ్ అడ్రస్. వరుసగా హిట్ చిత్రాల్లో నటించి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన హీరో. కానీ చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని అభిమానులకు తీరని బాధను మిగిల్చారు. ఒకప్పుడు వరుస హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు థియేటర్లలో డిజాస్టర్స్ అయ్యాయి. అలాగే సినిమాలు తగ్గిపోవడం.. వ్యక్తిగత కారణాలతో తీవ్ర మానసిక వేదనకు గురై తన నివాసంలో సూసైడ్ చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఇండస్ట్రీకి.. అభిమానులకు షాక్‏కు గురిచేసింది. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ సినిమాలకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్ అందుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఉదయ్ కిరణ్ మరోసారి బిగ్ స్క్రీన్ పై కనిపించనున్నారు. ఆయన కెరీర్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను మళ్లీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ సూపర్ డూపర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాల నుంచి ఒకప్పుడు డిజాస్టర్ అయిన సినిమాలను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. అయితే అప్పట్లో మిక్స్డ్ టాక్ అందుకున్న మూవీస్.. ఇప్పుడు మాత్రం భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ఇప్పటికే ఆరెంజ్, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఓయ్ చిత్రాలు మళ్లీ రిలీజ్ అయి మంచి విజయాన్ని ఇందుకున్నాయి. ఇక ఇప్పుడు మరిన్ని సినిమాలను రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఉదయ్ కిరణ్ నటించిన చిత్రాలను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ఉదయ్ కిరణ్ కు బాగా క్రేజ్ తీసుకువచ్చిన సినిమాలు నువ్వు నేను, మనసంతా నువ్వే. ఈ రెండు సినిమాలో అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రాలతోనే యూత్ లో ఉదయ్ కు ఫుల్ క్రేజ్ తీసుకువచ్చాయి. అంతేకాకుండా అతడి కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యాయి. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన నువ్వు నేను సినిమాలో అనిత హీరోయిన్ గా నటించగా.. తనికెళ్ల భరణి, శకుంతల కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలోని సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ యూట్యూబ్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. అలాగే విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన సినిమా మనసంతా నువ్వే. ఇందులో రీమా సేన్ హీరోయిన్.

ఇప్పుడు ఈ రెండు హార్ట్ టచింగ్ సినిమాలు మార్చి, ఏప్రిల్ నెలల్లో రీరిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇప్పుడిదే విషయం నెట్టింట వైరలవుతుండగా.. ఉదయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.✨

bottom of page