top of page

🎉 రాఖీ పండగ వేళ..టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు ముఖ్య గమనిక.. 🚌🎈

పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికులకు టీ-9 పేరుతో రెండు టికెట్లను ఆర్టీసీ సంస్థ జారీ చేస్తోంది. ✈️ అయితే ఆర్టీసీకి 60 కిలోమీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణించేందుకు టీ-9-60ని, 30 కిలోమీటర్లకు టీ-9-30 టికెట్లను అందుబాటులోకి ఇటీవల తీసుకొచ్చింది. 💰

టీ-9-60 టికెట్‌ను 100 రూపాయలకు అలాగే టీ-9-30 టికెట్‌కు 50 రూపాయలు ప్రయాణికుల నుంచి సంస్థ వసూలు చేస్తోంది. 🎟️ అయితే రాఖీ పండగ సందర్భంగా ఈ టికెట్లు నిలిపివేస్తున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. 🌟 పండగ రోజున బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని.. ఇలాంటి సమాయాల్లో టీ-9 టికెట్లు మంజూరు చేయడం సిబ్బందికి చాలా కష్టతరమవుతుందని ఆయన తెలిపారు. ⏰ వాస్తవానికి ఈ టికెట్లు ఇవ్వాలంటే ప్రయాణికుడి జెండర్, వయసు, తదితర వివాలన్నింటిని టిమ్ మిషన్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. 🕐

దీంతో కండక్టర్‌కు ఆ టికెట్లు ఇవ్వాలంటే కాస్త సమయం పడుతుంది. ⏱️ ఒకవేళ బస్సుల్లో రద్దీ ఎక్కవగా ఉన్నప్పడు చాలా సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ⌛ దీనివల్ల సిబ్బంది చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకోసమే టీ-9 టికెట్లను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు సజ్జనార్ తెలిపారు. 📅 ఆగస్టు 29 నుంచి.. సెప్టెంబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు ఈ నిలుపుదల అమల్లో ఉంటుందని చెప్పారు. సెప్టెంబర్ 2 తర్వాత మళ్లీ యథాతథంగా టీ-9 టికెట్లు కొనసాగుతాయని చెప్పారు. 🚌🎉


Commentaires


bottom of page