top of page

🎉 దసరా పండుగ వేళ గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ 📢

📅 మరికొన్ని రోజుల్లో బతుకమ్మ, దసరా పండుగలు రానున్నాయి. 🏙️ పట్టణాలు, నగరాల్లో ఉండే చాలామంది ప్రజలు తమ సొంతూళ్లుకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. 👣

ఈ నేపథ్యంలో ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా వారి గమ్యస్థానాలను చేర్చేందుకు టీఎస్‌ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 🚌 ప్రజల సౌకర్యార్థం కోసం ఏకంగా 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది టీఎస్‌ఆర్టీసీ. 📅 అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నాయి.

🌆 హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు సైతం ప్రత్యేక బస్సులు నడపనున్నారు. 🚍 అలాగే హైదరాబాద్‌లో ప్రధాన బస్టాండ్‌లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్‌తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండేటటువంటి కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్‎సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక సిటీ బస్సు అందుబాటులో ఉంచనున్నారు. 🚌 అంతేకాదు అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెగ్యూలర్, స్పెషల్ సర్వీసులను ఎంబీజీఎస్ నుంచి మాత్రమే కాకుండా మరికొన్ని ప్రాంతాల నుంచి నడపాలని నిర్ణయం తీసుకున్నారు సంస్థ అధికారులు. 🧑‍💼🚆

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page