top of page

🌹 ఎన్నికల సమరానికి సిద్ధమైన గులాబీ బాస్‌..

📅 ఈ నెల 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్‌లో జరిగే మొదటి సభతో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు.. ఈ సభలోనే బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను కూడా రిలీజ్ చేయబోతున్నారు. 📜 దీంతో ఇప్పుడు అందరి చూపు హుస్నాబాద్‌పై పడింది. కేసీఆర్‌ హుస్నాబాద్ సభ నుంచే ఎందుకు ప్రచారం మొదలుపెడుతున్నారన్నారని చెప్పుకొచ్చారు. 🎤

📅 అయితే దీని వెనకాల ఉన్న కారణాన్ని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఈ నెల 15వ తేదీన కేసీఆర్‌ నిర్వహించబోయే సభ ఏర్పాట్లను మంత్రి హరీష్‌ రావు పరిశీలించారు. 📋

🔍 అనంతరం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో మంత్రి హరీష్ రావు సమావేశం ఏర్పాటు చేశారు. 🌆

📆 హుస్నాబాద్‌లోని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా కాంగ్రెస్, బీజేపీ వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి తీరుతామన్నారు మంత్రి. 🙌 హుస్నాబాద్‌ బీఆర్‌ఎస్ పార్టీకి కలిసి వచ్చిన నియోజకవర్గమని సీఎం తెలిపారు మంత్రి. 🚀 తెలంగాణలో మూడోసారి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని మంత్రి అన్నారు. 🏆 అసత్య సర్వేలతో కాంగ్రెస్‌ గ్లోబల్స్‌ ప్రచారం చేస్తుందన్న మంత్రి, కనీసం పార్టీలో ఉన్న నేతలకు టికెట్లు కూడా ఇచ్చుకోలేని దయనీ పరిస్థితిలో కాంగ్రెస్‌ పార్టీ ఉందన్నారు. 🙏

📢 హుస్నాబాద్‌లోని గౌరవెల్లి ప్రాజెక్టు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన గొప్ప వరమని హరీష్‌ రావు అన్నారు. 🌟 ఈ నెల 15వ తేదీన బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ప్రతిపక్షాల మైండ్‌ బ్లాంక్‌ అవ్వడం ఖాయమని, 2009లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏ ఒక్క హామీ కుడా అమలు చేయలేదని, 2004లో తెలంగాణ ఇస్తామని బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తర్వాత తెలంగాణ ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌ను మింగేయాలని చూసిందని చెప్పుకొచ్చారు. 🗳️✨

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page