పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. పుష్ప 2 సినిమా తర్వాత బన్నీ మరో రెండు ప్రాజెక్టులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో దర్శకుడు అట్లీ సినిమా ఒకటి. ఇక, ఈసినిమాలో అల్లుఅర్జున్ సరసన హీరోయిన్గా త్రిష చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ కాస్త సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతోంది. త్రిష హీరోయిన్గా మౌనం పసియాదే చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా 2002 డిసెంబర్లో విడుదలయ్యింది. ఆ తర్వాత పెద్ద పెద్ద స్టార్స్తో సినిమాలు చేసి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. వర్షం, నువ్వొస్తానంటే..నేనొద్దంటానా.. ఆడవారి మాటలకు ఆర్థాలే వేరులే వంటి చిత్రాలు త్రిష కెరీర్లో ది బెస్ట్ చిత్రాలుగా చెప్పొచ్చు. ఆ తర్వాత చాలా సినిమాలు నటించింది ఈ అమ్మడు. ఒక్క తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇప్పడు త్రిష బన్నీతో జోడికట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈవిషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ వార్త నిజమైతే, బన్నీ, త్రిష కాంబీనేషన్లో వచ్చే మొదటి చిత్రం ఇదే అవుతుంది. 🎥✨