top of page

అనుమానంతో కన్నకూతురిని చంపిన కర్కోటకుడు-ఆపై మృతదేహాన్ని బైక్ కు కట్టి ఊరేగింపు..

కన్నకూతురు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజే తిరిగి ఇంటికి చేరుకుంది. అయితే కూతురికి ఎవరితోనే సంబంధం ఉందని అనుమానం, కోపం పెంచుకున్న తండ్రి ఆమెను దారుణంగా కొట్టి చంపేశాడు. ఆపై ఆమె మృతదేహాన్ని తాడుతో బైక్ కు కట్టి ఊరేగించాడు.

అసలేం జరిగిందంటే..?

పంజాబ్ లోని అమృత్ సర్ కు చెందిన దల్బీర్ సింగ్ ఒక కూలీ. బుధవారం రోజు అతడి16 ఏళ్ల కూతురు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. మరుసటి రోజు తిరిగి వచ్చింది. ఈ క్రమంలోనే దల్బీర్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు ఎవరితోనే సంబంధం ఉందనుకొని భావించి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆ కోపంతోనే ఆమెపై దాడి చేశాడు. కుటుంబ సభ్యులు అందరూ ఎంతగా ఆపే ప్రయత్నం చేసినా అతడు ఆగలేదు. ఓ గదిలోకి తీసుకెళ్లి మరీ ఆమెను విపరీతంగా కొట్టడంతో కూతురు అక్కడికక్కడే చనిపోయింది. కూతురు చనిపోయినా అతడి కోపం చల్లారలేదు. దీంతో ఆమె మృతదేహాన్ని తన ద్విచక్రవాహనానికి కట్టి ఈడ్చుకెళ్లాడు. ఊరంతా తప్పి ఆపై దగ్గర్లోని రైలు పట్టాలపై పడేశాడు.

వీడియోలు వైరల్..

అయితే ఆమెపై దాడి చేస్తుండగా.. స్థానికులు వీడియోలు, ఫొటోలు తీశారు. ముఖ్యంగా మృతదేహాన్ని గ్రామంలో తిప్పుతుండగా.. తీసిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దల్బీర్ ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page