top of page

🚦👮‍♂️ సీఎం కాన్వాయ్ కోసం కీలక నిర్ణయం తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు

👨‍💼 ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి గతానికి భిన్నంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ కు అంతరాయం కలుగొద్దని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా వాహనాల సంఖ్యను కూడా దాదాపు సగానికి తగ్గించాలని సూచించారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా ట్రాఫిక్‌ పోలీసులు కొత్త పద్ధతి పాటిస్తున్నారు. తన కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దు, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న సీఎం ఆదేశాలతో పోలీసులు ఈ నూతన విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే కొత్త మూవింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

🚖🛣️ జూబ్లీహిల్స్‌ నుంచి గాంధీభవన్‌కు వెళ్లాలంటే… ఖైరతాబాద్‌ జంక్షన్‌ వరకూ ఇదే మార్గంలో సీఎం కాన్వాయ్ వెళ్తుంది. అక్కడ్నుంచి లక్డికపూల్‌, అసెంబ్లీ మీదుగా నాంపల్లి, గాంధీభవన్‌కు చేరుకుంటుంది ముఖ్యమంత్రి కాన్వాయ్‌.. రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ వెళ్లే మార్గాల్లో పోలీసులు పక్కా వ్యూహంతోనే సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే కొత్త మూవింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 🚗🛣️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page