top of page

🔪💰 క్యాషియ‌ర్‌ను క‌త్తితో బెదిరించి.. ఎస్‌బీఐ బ్యాంకులో రూ. 6.5 ల‌క్ష‌లు ఎత్తుకెళ్లాడు.! 💵💼

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎస్బీఐ బ్రాంచీలో ప‌గ‌టిపూటే దోపిడీ జ‌రిగింది. 🔪🏦 న‌ర్సాపురం ప‌ట్ట‌ణంలో ఉన్న ఆ బ్రాంచీలోకి ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి క‌త్తితో క్యాష్ ఆఫీస‌ర్‌ను బెదిరించి 6.5 ల‌క్ష‌లు ఎత్తుకెళ్లాడు. 💼🔪🏃‍♂️

మాస్క్ పెట్టుకుని వ‌చ్చిన ఆ వ్య‌క్తి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యంలో క్యాషియ‌ర్‌ను బెదిరించి డ‌బ్బుతో ఉడాయించాడు. 💼💨 క్యాష్ ఆఫీస‌ర్‌ రూమ్‌కు నేరుగా వ‌చ్చిన ఆ వ్య‌క్తి.. గోల్డ్ లోన్ కావాల‌న్న నెపంతో ఎంట‌ర్ అయ్యాడు. 🌟🏦🔫 ఆ త‌ర్వాత దాచుకున్న క‌త్తిని తీసి ఆ ఆఫీస‌ర్‌ను బెదిరించాడు. 💰💼 6.5 ల‌క్ష‌ల న‌గ‌దుతో ప‌రారీ అయిన‌ట్లు న‌ర్సాపురం పోలీసు ఆఫీస‌ర్ కే ర‌వి మ‌నోహ‌రా చారి తెలిపారు. 🔍🚓

దోపిడీ చేసిన వ్య‌క్తి మాస్క్‌తో పాటు త‌ల‌కు టోపీ పెట్టుకున్న‌ట్లు పోలీసులు చెప్పారు. 🧢💼 త‌న ఐడెంటిటీని దాచి పెట్టుకునేందుకు అత‌ను క్యాప్‌తో వ‌చ్చిన‌ట్లు అనుమానిస్తున్నారు. 👤💬 జోయ్‌సులా వీధి ఎస్‌బీఐ బ్యాంకులో దోపిడి చేయ‌డానికి ముందు నిందితుడు మూడు గంట‌ల పాటు రెక్కీ చేసిన‌ట్లు తెలుస్తోందని పోలీసులు చెప్పారు. 🕐🚔

కాగా బ్యాంకులో దోపిడీ జ‌రిగిన స‌మ‌యంలో ముగ్గురు మ‌హిళ‌లు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. 👩👩👩🚓 క్యాష్ ఆఫీస‌ర్‌, అటెండెంట్‌తో పాటు మ‌రో మ‌హిళా ఆఫీస‌ర్ త‌న క్యాబిన్‌లో ఉన్నారు. 💼🚺 ఆ స‌మ‌యంలో బ్యాంకు మేనేజ‌ర్ బ్యాంకులో లేరు. 🧑🏦 దోపిడీ చేసిన వ్య‌క్తి పై ఐపీసీ 392 సెక్ష‌న్ కింద కేసు బుక్ చేసి అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 📜🚓

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page