top of page

అయోధ్య రామయ్యను వదలని దొంగలు.. ఆలయ పరిసరాల్లో లైట్లు చోరీ..


రామ్‌పథ్‌లోని చెట్లపై అమర్చిన 3,800 వెదురు లైట్లు, భక్తి పథంలో 36 గోబో ప్రొజెక్టర్ లైట్లు చోరీకి గురైనట్లు ఆల‌య ట్ర‌స్టు అధికారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయ‌న ఫిర్యాదు మేర‌కు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు పోలీసులు. కాగా, అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం యష్ ఎంటర్‌ప్రైజెస్, కృష్ణ ఆటోమొబైల్స్ సంస్థలు లైట్లను ఏర్పాటు చేశాయి.


ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం రామ్‌పథ్‌లో 6,400 వెదురు లైట్లు, భక్తి ప‌థంలో 96 గోబో ప్రొజెక్టర్ లైట్లను సంస్థలు ఏర్పాటు చేశాయి. “మార్చి 19 వరకు అన్ని లైట్లు ఉన్నాయి. కానీ మే 9 న తనిఖీ తర్వాత కొన్ని లైట్లు కనిపించలేదు. ఇప్పటి వరకు 3,800 వెదురు లైట్లు, 36 ప్రొజెక్టర్ లైట్లను ఎవరో గుర్తుతెలియని దుండ‌గులు దొంగిలించారు” అని శేఖర్ శర్మ తెలిపారు. అయోధ్యను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేపట్టిన పథకం కింద మఠం-ఆలయంతోపాటు ప్రధాన రహదారుల వెంట ఆకర్షణీయమైన దీపాలను ఏర్పాటు చేశారు. పర్యాటక ప్రదేశాల్లోని ఈ అందాలను చూసి దొంగలు ఎప్పుడు, ఎలా వెళ్లారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ రామపథం, భక్తిపథం మార్గాల్లో లైట్లను అమర్చే కాంట్రాక్టును  యష్ ఎంటర్‌ప్రైజెస్, కృష్ణ ఆటోమొబైల్‌కు ఇచ్చింది. దీని కింద నయా ఘాట్, హనుమాన్ గర్హి, తేధి బజార్‌లో సుమారు 6400 వెదురు, 96 గోబో ప్రొజెక్టర్ లైట్లను ఏర్పాటు చేశారు. యష్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధి శేఖర్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. రాంపత్ మరియు భక్తిపై నాటిన 3800 వెదురులతో పాటు 36 గోబో లైట్లు చోరీకి గురయ్యాయి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page