top of page

🚄 దేశంలో తొలి బుల్లెట్‌ ట్రైన్ స్టేషన్‌.. 🚄

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టును చేపడుతోన్న విషయం తెలిసిందే.

ఈ ప్రాజెక్టులో భాగంగా అహ్మదాబాద్‌ నుంచి ముంబయికి తొలి బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుంది. ఇందులో భాగంగానే ఈ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ కీలక ప్రకటన చేశారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా తొలి బుల్లెట్‌ రైలు కోసం నిర్మించిన స్టేషన్ వీడియోను కేంద్ర మంత్రి షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సబర్మతి మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కారిడార్‌ హబ్‌లో ఈ స్టేషన్‌ను నిర్మించారు. దేశంలోనే తొలిసారి చేపట్టిన హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మాణంలో భాగంగా ఈ స్టేషన్‌ నిర్మాణం చేపట్టారు. అత్యాధునిక సదుపాయాలతో ఈ స్టేషన్‌ను నిర్మించినట్లు స్పష్టమవుతోంది. బుల్లెట్ ట్రైన్ స్టేషన్‌ను జంట భవనాలుగా రూపొందించారు. స్టేషన్‌కు అవతల గోడలపై ఉప్పు సత్యాగ్రహం సన్నివేశాలకు సంబంధించిన భారీ చిత్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్‌ను మొత్తం 1,33,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్‌లో ఆఫీస్‌లు, వాణిజ్య కార్యాలయాలు, రిటైల్‌ స్టోర్లు ఏర్పాటు చేసుకొనే విధంగా నిర్మించారు. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ ట్వీట్... 🚉💼✨


Opmerkingen


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page