top of page

ఆఫ్ఘనిస్తాన్‌కు గాంధారీ ఇచ్చిన శాపం

మహాభారత కాలంలో గాంధార రాజ్యం నేటి ఆఫ్ఘనిస్తాన్‌ అని చాలామంది అంటారు. దీనికి రుజువు ఇదిగో అంటూ ఆ దేశంలోని ఒక నగరాన్ని ఇప్పటికీ కాందహార్ అని పిలుస్తారు. ఈ పదం గాంధార నుంచి  ఉద్భవించింది. దీని అర్థం ‘సువాసనల భూమి’. ఈ పదం ఋగ్వేదం, మహాభారతం, ఉత్తర-రామాయణం వంటి వివిధ పాత గ్రంథాల్లో ప్రస్తావించబడింది. సహస్రనామం ప్రకారం శివుని పేర్లలో గాంధారం ఒకటి. గాంధార మొదటి నివాసులు శివ భక్తులని కూడా నమ్ముతారు.

పురాణాల కథల ప్రకారం  కౌరవుల తల్లి అయిన గాంధారి శ్రీకృష్ణుడిని శపించడంతో ద్వారకా నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయింది. దీనితో పాటు గాంధారి తన సోదరుడు శకునిని కూడా శపించింది. ఎందుకంటే గాంధారి తన కొడుకుల మరణానికి తన సోదరుడైన శకుని కారణంగా భావించింది. తన 100 మంది కొడుకులను చంపిన గాంధార రాజు శకుని రాజ్యంలో ఎప్పుడు ఎవరూ శాశ్వతంగా నివసించరని.. ఇక్కడ శాంతి ఉండదు, ఎల్లప్పుడూ బాధలు పడతారని.. రక్తం కారుతూ ఉండే వాతావరణం ఉంటుందని శాపాన్ని ఇచ్చింది.అలా గర్భ శోకంతో గాంధారి ఇచ్చిన శాపం వల్ల ఆఫ్ఘనిస్తాన్‌లో ఎప్పుడూ శాంతి వాతావరణం ఉండదని నమ్ముతారు. తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత, అంతకు ముందు కూడా శాంతి లేదు. ఈ దేశాన్ని  ఇప్పటి వరకూ ఎవరు పాలించినా స్థానికులు టెన్షన్, గొడవలు లేకుండా జీవించలేదు. ఈ కారణాలన్నింటికీ కారణం గాంధారి శాప ప్రభావమేనని నమ్ముతారు.

bottom of page