5జీ టెక్నాలజీ భవిష్యత్తును శాసించనుంది. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఇంటర్నెట్ కంటే మరింత వేగంగా అందించేలా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
అయితే ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్స్ వస్తువులు 5జీ టెక్నాలజీకి అనువుగా పనిచేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ సాంకేతికతకు సరిపడే మొబైల్ఫోన్లను కొనుగోలు చేయాలి. ఈ క్రమంలో.. రియలన్స్ జియో మరో అద్భుతానికి తెర తీస్తోంది. అదికూడా రూ. 10వేలలోనే 5జీ ఫోన్ను తీసుకొచ్చేందుకు రియలన్స్ సన్నాహాలు చేస్తోంది. తర్వలోనే ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. భారత ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోతో కలిసి అమెరికాకు చెందిన సెమీకండక్టర్ సంస్థ క్వాల్కామ్ చిప్సెట్ కంపెనీ ఈ కొత్త జియో 5జీ ఫోన్ అభివృద్ధి చేస్తోంది. దీని ధర సుమారుగా 99 డాలర్ల లోపు (సుమారు రూ.8,200) ఉండనుంది. 🚀💰