top of page

ఉద్విగ్న వాతావరణంలో కవిత విడుదల.. తీహార్‌ జైలు వద్ద భారీ స్వాగతం


జైలు వద్ద భారీ స్వాగతం

తీహార్‌ జైలు నుంచి మంగళవారం పొద్దుపోయిన తర్వాత కవిత విడుదలయ్యారు. రౌస్‌ అవెన్యూ న్యాయస్థానం నుంచి కవిత బెయిల్‌కు సంబంధించిన పత్రాలను న్యాయవాదులు జైలు అధికారులకు సమర్పించారు. జైలు లాంఛనాలు పూర్తయిన తర్వాత రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆమె బయటకు వచ్చారు. కవిత విడుదల సందర్భంగా తీహార్‌ జైలు వద్దకు పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. హరీశ్‌రావు, కేటీఆర్‌తోపాటు పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్‌ సురేశ్‌రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్‌రావు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శంబీపూర్‌ రాజు, కేపీ వివేక్‌ తదితరులు కూడా వచ్చారు. కవిత భర్త అనీల్‌ కుమార్‌, ఆమె పిల్లలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీ లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున కవితకు జైలు వద్ద స్వాగతం పలికారు. గంటల తరబడి వేచి చూసిన వీరంతా ‘కవిత.. డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని కవితకు స్వాగతం పలికారు. జైలు పరిసరాల్లో మిఠాయిలు పంచారు. జైలు నుంచి కవిత నేరుగా వసంత విహార్‌లో ఉన్న పార్టీ కార్యాలయానికి వెళ్లారు.

కవిత భావోద్వేగం.. నేడు హైదరాబాద్‌ రాక

జైలు నుంచి బయటకు వచ్చిన కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గేటు బయటే ఉన్న పెద్ద కొడుకు ఆదిత్య, భర్త అనిల్‌, సోదరుడు కేటీఆర్‌ను ఆలింగనం చేసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. బుధవారం మధ్యాహ్నం 2.45గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయల్దేరనున్నారు. నేరుగా శంషాబాద్‌ విమానాశ్రయానికి రానున్నారు. కవిత రాక సందర్భంగా అభిమానులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలు ఆమెకు సాదరస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page