top of page

19 రోజుల్లో 200కోట్లు..వండర్స్ క్రియేట్స్‌ చేస్తున్న స్టోరీ..!కానీ ఆగని నిరసనలు వివాదాలు..

కంటెంట్ ఉంటే చాలా.. స్టార్ కటౌట్ అవసరం లేదనే కామెంట్ను మరో సారి కేరళ స్టోరీస్ ఫిల్మ్ నిజం చేసి చూపించింది. మతం చాటున.. ఓ వర్గం చేసే అరాచక చర్యను కల్లకు కట్టినట్టు చూపించి.. అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. కలెక్షన్లో ఎలాంటి డ్రాప్ లేకుండా.... త్రూ అవుట్ ఇండియా రన్ అవుతోంది.

సుదీప్తో సేన్ డైరెక్షన్లో అదా శర్మ లీడ్‌ రోల్లో తెరకెక్కిన ది కేరళ స్టోరీ సినిమా.. వివాదాల మధ్యే.. సూపర్ డూపర్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్‌లో దూకుడుగా.. దూసుకుపోతోంది. ఇక మే 5 న రిలీజ్ అయిన ఈ సినిమా.. ఫస్డ్ డే 8 కోట్లను వసూలు చేయగా.. రెండు రోజు దానికి మించేలా.. 11.22 కోట్లను వచ్చేలా చేసుకుంది. ఇక రిలీజ్‌ అయిన మూడు వారాలు కావస్తున్నా… అదే జోర్తో రన్ అవుతూ.. తాజాగా దాదాపు 206.97కోట్లను వసూలు చేసింది ఈ సినిమా. అంటే just 19 రోజుల్లోనే ఈసినిమా 200కోట్ల క్లబ్బులోకి ఎక్కేసింది. స్టార్లు గీర్లు లేకుండా.. చిన్న చితకా యాక్టర్స్‌తో… ఓ ఇష్యూను ఎక్స్‌పోజ్‌ చేసిన ఈసినిమా ఈరేంజ్‌ సక్సెస్ కావడం ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. కంటెంట్ ప్రధానంగా సినిమాలు.. వెట్ సీరస్‌లు వస్తే ఇలాంటి రిజెల్టే వస్తుందనే కామెంట్స్ వచ్చేలా చేసుకుంటోంది. బాలీవుడ్ మేకర్స్‌ను కూడా ఆలోచనల్లో పడేస్తోంది.


Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page