top of page
Suresh D

జగన్‌కు జై కొట్టడమే శాపమా..? టీడీపీ , జనసేన ట్రోలింగ్‌కు బలైన యువతి 😡

ఏపీకి చెందిన గీతాంజలి అనే అమ్మాయి సోషల్ మీడియాలో ఇటీవల ఒక వీడియో పోస్ట్ చేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయో అని గీతాంజలి ఓ వీడియోలో వివరించింది.

ఏపీకి చెందిన గీతాంజలి అనే అమ్మాయి సోషల్ మీడియాలో ఇటీవల ఒక వీడియో పోస్ట్ చేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయో అని గీతాంజలి ఓ వీడియోలో వివరించింది. గీతాంజలిది పేద కుటుంబం. పైగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గతంలో ఆమె కుటుంబం ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేది. జగన్ ప్రభుత్వం ఆమెకు ఇంటి పట్టా అందించింది. ఇంటి పట్టా అందుకున్న తరువాత గీతాంజలి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా గీతాంజలి మీడియాతో మాట్లాడింది. ఈ వీడియోను అధికార వైసీపీ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో గీతాంజలి ఒక్కసారిగా ఫేమస్ అయింది. దీంతో టీడీపీ, జనసేనకు చెందిన కార్యకర్తలు గీతాంజలిని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ దిగారు. ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ అసభ్యపదజాలంతో గీతాంజలిని దుయ్యపట్టారు. టీడీపీ, జనసేన ట్రోలింగ్ తట్టుకోలేని గీతాంజలి రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. 😠😔

bottom of page