top of page

🔵🔸🌟తెలంగాణ కాంగ్రెస్‌లో నయా జోష్‌..

తెలంగాణ కాంగ్రెస్‌లో నూతనోత్సాహం కనిపిస్తోంది. వరుస చేరికలతో గాంధీభవన్‌ 🏰 కళకళలాడుతోంది. ప్రధాన పార్టీల్లోని అసంతృప్త నేతలంతా కాంగ్రెస్‌లోకి క్యూకడుతున్నారు. ఇవాళ, ఢిల్లీ వేదికగా కాంగ్రెస్‌ కండువా కప్పుకోబోతున్నారు 🗳️🔴

కీలక లీడర్స్‌. ఇంతకీ, కాంగ్రెస్‌లో చేరబోతున్న ఆ నేతలు ఎవరు? 🤔 రేవంత్‌ ఇవాళ ఢిల్లీ ఎందుకెళ్తున్నారు? 🧐 డిటైల్స్ చూడండి.. కర్నాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు జంప్‌ జిలానీలు. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లోకి వలసల జోరు కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలల టైమ్‌ కూడా లేకపోవడంతో ముందే జాయినై కర్ఫీప్‌ వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బాటలోనే మరోసారి ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరడానికి రెడీ అవుతున్నారు. జూపల్లి కృష్ణారావు ఆల్రెడీ ముహూర్తం ఫిక్స్‌ చేసుకోగా, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు టీకాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో చర్చలు జరిపారు తీగల కృష్ణారెడ్డి.టీడీపీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన తీగల.. హైదరాబాద్‌ మేయర్‌గా పనిచేశారు. 2009లో మహేశ్వరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత, బీఆర్‌ఎస్‌లో చేరిన తీగల.. 2018లో మరోసారి సబిత చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక, తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి.. మహేశ్వరం జెడ్పీటీసీగా గెలిచి రంగారెడ్డి జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ అయ్యారు. అయితే, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడంతో.. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. అదే టైమ్‌లో తనకు ప్రాధాన్యత తగ్గుతోందని భావించిన తీగల.. కాంగ్రెస్‌లో చేరాలని డిసైడైనట్టు తెలుస్తోంది. 🌹🔷🔸

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page