🏛️ అసెంబ్లీ ఎన్నికల వేళ.. సీడబ్యూసీ భేటీతో పాటు విజయభేరి సభతో తెలంగాణ ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది.
మరోవైపు బీజేపీ-బీఆర్ఎస్ వైఫల్యాలు ప్రజల్లో చర్చకు వచ్చేలా చూస్తోంది. ఇందుకోసం ప్రణాళిక సిద్దం చేసిన కాంగ్రెస్.. ఆ రెండు పార్టీలపై ఛార్జ్షీట్ రిలీజ్ చేసింది. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. అధికార బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. టైమ్ దగ్గర పడుతుండటంతో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ-బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను డోర్ టు డోర్ తీసుకెళ్లడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ రెండు పార్టీలు ఏం హామీలిచ్చాయి..? ఎన్ని నెరవేర్చారు..? అవన్నీ పాయింట్ టు పాయింట్ ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లబోతుంది. ఇందులో భాగంగా బీజేపీ-బీఆర్ఎస్ ప్రాధాన్యం పొందింది. 🗳️🤝🏛️🎙️🔍🔴✅👥
Comments