top of page

సీసీటీవీ కెమెరాల నిఘాలో హైదరాబాద్ సురక్షితమేనా.. ?

విశ్వ నగరం హైదరాబాద్‌లో దాదాపు ఐదు లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి. నగరంలో ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా.. ఒక రకంగా చెప్పాలంటే చీమ చిటుక్కుమన్నా ఇట్టే పట్టుకుంటామంటూ రాష్ట్ర హోం మంత్రిని మొదలుకొని.. కిందిస్థాయి కానిస్టేబుల్ వరకు తరచూ చెప్పే మాట ఇది. కానీ వాస్తవానికి పరిస్థితి దానికి పూర్తి విరుద్ధంగా ఉంది.

విశ్వ నగరం హైదరాబాద్‌లో దాదాపు ఐదు లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి. నగరంలో ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా.. ఒక రకంగా చెప్పాలంటే చీమ చిటుక్కుమన్నా ఇట్టే పట్టుకుంటామంటూ రాష్ట్ర హోం మంత్రిని మొదలుకొని.. కిందిస్థాయి కానిస్టేబుల్ వరకు తరచూ చెప్పే మాట ఇది. కానీ వాస్తవానికి పరిస్థితి దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. బ్రాండ్ హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సీసీ కెమెరాల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ హైదరాబాద్‌లో ఈ పరిస్థితికి కారణం ఏంటి.కమ్యూనిటీ పోలీసింగ్ పేరిట దాదాపు 5 లక్షల సీసీ కెమెరాలు హైదరాబాద్‌తో పాటు రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్నాయి.హైదరాబాద్ లో ఏ ఇన్సిడెంట్ జరిగిన సీసీ కెమెరాలు రికార్డ్ అవుతాయంటూ పెద్ద ఎత్తున పోలీసులు ప్రచారం చేశారు. సీసీటీవీ కెమరాల సాయంతో ఏ మూల ఎలాంటి నేరం జరిగినా నిందితులును గంటల వ్యవధిలో పట్టేస్తామని పోలీసు అధికారులు చెబుతుంటారు. ఇలా పలు కేసులను పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే గత 15 రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న వరుస దారుణాల కారణంగా సీసీ కెమెరాలు పనితీరు పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.ఒకవైపు హత్యలు, మరోవైపు కిడ్నాప్‌లు, వరుస యాక్సిడెంట్లతో హైదరాబాద్ రక్తపాతం ఎక్కువైంది. హైదరాబాదులో గడిచిన 15 రోజుల్లో ఆరు హత్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి.హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో మూడు హత్యలు, సైబరాబాద్ లో మూడు హత్యలు, రాచకొండలో వరుస కిడ్నాప్ ఘటనలు కలకలం రేపాయి. హయత్ నగర్ లో నాలుగేళ్ల చిన్నారి కిరాణా షాప్ కు వెళ్తే ఆమెపైన అత్యాచారానికి ప్రయత్నించి కిడ్నాప్ చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. అమ్మాయి తప్పించుకోవడంతో నిందితుడు ఇంతవరకు దొరకలేదు. నిందితులు విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డుఅయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా నిందితుని ఆచూకీ పోలీసులకు దొరకలేదు.తాజాగా ఘట్కేసర్ లో జరిగిన మరొక కిడ్నాప్ ఘటన కూడా ఇదే రకంగా ఉంది. కృష్ణవేణి అనే నాలుగేళ్ల పాప బయట ఆడుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి కిడ్నాప్ చేసి పారిపోతుండగా సీసీ కెమెరాల రికార్డు అయింది. రాత్రి 8 గంటల సమయంలో పాప మిస్ అయితే ఉదయం 11 గంటల వరకు కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు. చివరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న సురేష్ అనే వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుంటే పాప కృష్ణవేణి కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమయ్యింది. వేలాది సీసీ కెమెరాల ఫుటేజీని నగర పోలీసులు విశ్లేషించినా, కిడ్నాప్ తర్వాత నిందితుడి కదలికలను కనుక్కోలేకపోయారు.


Commenti


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page