top of page

తెలంగాణలో మళ్ళీ అధికారంపై కేసీఆర్ ధీమా 📉👤

రెండు రోజులు నిమ్మలంగా ఉండండి.. ఎగ్జాక్ట్‌ పోల్స్‌ కళ్లముందు ఉంటాయని సీఎం వ్యాఖ్యానించారట. ఇక మూడో తేదిన సంబరాలు చేసుకుందామని నాయకులకు కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ప్రగతిభవన్‌ నుంచి వెళ్తూ విక్టరీ సింబల్ చూపించారు పలువురు బీఆర్‌ఎస్ నేతలు.

మరోవైపు చాలాకాలం తర్వాత నిన్న రాత్రి మంచిగా నిద్రపోయానన్నారు..బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR. ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు అతిశయోక్తిగా ఉన్నాయన్న కేటీఆర్‌.. కౌంటింగ్‌లో బీఆర్‌ఎస్‌కు మంచి ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు‌ సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

కాగా ఇప్పటివరకు అందిన వివరాల మేరకు రాష్ట్రంలో 70.79% పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. డిసెంబర్‌ 3న జరిగే ఓట్ల లెక్కింపు కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓట్‌ ఫ్రం హోమ్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. రాష్ట్రంలో రీపోలింగ్‌కు అవకాశం లేదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న వివరాల మేరకు రాష్ట్రంలో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03%, అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.56% పోలింగ్‌ నమోదైందని వికాస్‌రాజ్‌ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌లో 14 చోట్ల కౌంటింగ్ జరుగుతుందని.. ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ ఓట్ల కౌంటింగ్.. ఎనిమిదిన్నర నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. 🗳️✨


Hozzászólások


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page