top of page
MediaFx

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. రూపాదేవి వికారాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె పంచశీల కాలనీలోని నివాసంలో ఉరి వేసుకున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రూపాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఆమె రెండు రోజులుగా స్కూలుకు వెళ్లలేదని సమాచారం. సత్యం ఉదయం నియోజకవర్గంలో ఉండి సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. కొద్దిరోజుల క్రితం కుటుంబం బంధువులతో తిరుమల సహా పుణ్యక్షేత్రాలకు వెళ్లి వచ్చారు. ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

bottom of page