top of page

ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. ప్రచారం చేస్తుండగా మధ్యలోనే..! 🤒📢

ఇటిక్యాల, నవంబర్ 18: జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురైయ్యారు. ఇటిక్యాలలో రోడ్‌షో నిర్వహిస్తుండగా.. కవిత ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. పార్టీ కార్యకర్తలు సపర్యలు చేయడంతో 5 నిమిషాల తరువాత ఆమె తిరిగి కోలుకున్నారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జగిత్యాల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు కవిత. జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కు మద్దతుగా రాయికల్‌లో ప్రచారం నిర్వహిస్తుండగా.. ఆమె అస్వస్థతకు గురై స్పృహ తప్పారు. మళ్లీ కాసేపటికి ఆమె సృహలోకి రావడంతో అక్కడి కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. 🚑📅


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page