top of page

💰 రూ. 10వేలలోనే 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్‌ లాంచ్‌..

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రెడ్‌మీ 13సీ పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది.

ఈ స్మార్ట్ ఫోన్‌ ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్‌, 128 జీబీ వేరింట్ ధర రూ. 9,999 కాగా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 11,499కాగా, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 13,499గా ఉంది.

రెడ్‌మీ 13సీ ఫోన్‌లో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 1,600 x 720 పిక్సెల్‌ రిజల్యూషన్‌, 90Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ట్రిపుల్ స్లాట్ సిమ్‌ ట్రేని అందిచారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ విషయానికొస్తే 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 10 వాట్స్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

ఇక రెడ్‌మీ 13సీ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డిసెంబర్‌ 12వ తేదీ నుంచి అమెజాన్‌తో పాటు రిటైల్ స్టోర్‌లలో అందుబాటులోకి రానుంది. 📱🚀






Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page