top of page

📱 వాట్సాప్, యూపీఐ ఫీచర్లతో జియో 4జీ ఫోన్.. ధర కేవలం రూ. 999 🌐

రిలయన్స్ జియో వాట్సాప్, లైవ్ టీవీ స్ట్రీమింగ్ యూపీఐ చెల్లింపులు వంటి ఫీచర్లతో రూ. 999కే 4జీ సపోర్టుతో ఉండే జియో భారత్ ఫోన్‌లు మార్కెట్లో మంచి బాగా రాణించాయి. 📱

దీనిని మరింత అనువైనదిగా మార్చేందుకు రిలయన్స్ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు రిలయన్స్ జియో ప్రెసిడెంట్ (పరికరాల విభాగం) సునీల్ దత్ తెలిపారు. 🚀 టెలికాం దిగ్గజం నోకియా, లావా, ట్రాన్స్‌షన్స్ ఐటెల్ వంటి మొబైల్ ఫోన్ బ్రాండ్‌లతో కలిసి కొత్త స్మార్ట్‌ఫోన్ వెర్షన్‌లను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. 🌐 ఇప్పటికీ 2జీ వినియోగిస్తున్న 250 మిలియన్ల వినియోగదారులను 4జీ వైపు మళ్లించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామన్నారు. 2జీ ఫోన్ వినియోగదారు ఉపయోగించడం సౌకర్యంగా ఉండదని అన్నారు. 📶 అలా అని 4జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలంటే ఖర్చు అవుతోందన్నారు. 💸

జియో భారత్ ప్లాట్‌ఫారమ్‌లో నాలుగు మోడళ్లు ఉన్నాయి. గత నెలలో, రిలయన్స్ జియో కొత్త 4జీ ఫోన్, జియోభారత్ బీ1ను ప్రవేశపెట్టింది . కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 1,299 విలువైన ఫోన్ 2.4అంగుళాల స్క్రీన్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది సినిమాలు, వీడియోలు, స్పోర్ట్స్ హైలైట్‌లను ఆస్వాదించడానికి జియో యాప్‌లను ప్రీ ఇన్‌స్టాల్ చేసింది. 🎬 ఫోన్ 23 భారతీయ భాషలను అప్‌పోర్ట్ చేస్తుంది. యూపీఐ చెల్లింపుల కోసం జియో పే యాప్‌ను అందిస్తుంది. 📲 జియో ప్రవేశపెట్టిన ఇతర ఫోన్‌లలో జియో ఫోన్, జియో ఫోన్ 2, జియో ఫోన్ నెక్స్ట్, జియో భారత్ వి2, కె1 కార్బన్ ఉన్నాయి. 📱🌐

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page