top of page

📱 లావా నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది..

🇮🇳 భారత్‌కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లావా త్వరలోనే లావా బ్లేజ్‌ ప్రో పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. 🚀 ఈ స్మార్ట్ ఫోన్‌ నవంబర్‌ నెలలో భారత మార్కట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 📅

📊 అయితే ఇప్పటి వరకు ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. స్మార్ట్ ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌కు సంబంధించి నెట్టింట కొన్ని వార్తలు లీక్‌ అవుతున్నాయి.

📡 నెట్టింట వైరల్‌ అవుతోన్న వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6020 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 💻 ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 15వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 💰

📸 ఇక కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నారని సమాచారం. 📷 అలాగే మెరుగైన క్వాలిటీ ఫొటోలు, వీడియోల కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌ను అందించనున్నారు. 📸📹

📱 ఇక లావా గతేడాది విడుదల చేసిన 4జీ వెర్షన్‌ ధర రూ. 10,499గా ఉంది. ఇందులో 6.5 ఇంచెస్‌తో కూడిన 2.5 కర్వ్‌ర్డ్‌ ఐపీఎస్‌ డిస్‌ప్లేను అందిచారు. 📶 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ ప్రత్యేకత. 📶🔥

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page