🌏 దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ భారత మార్కెట్లోకి కొత్త ప్రీమియం స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ఎల్జీ క్యూఎన్ఈడీ 83 సిరీస్ పేరుతో ఈ స్మార్ట్ టీవీని బుధవారం భారత మార్కెట్లోకి విడదుల చేశారు.
📏 ఈ సిరీస్లో భాగంగా 65 ఇంచెస్, 55 ఇంచెస్తో కూడిన రెండు టీవీలను లాంచ్ చేశారు. ధర విషయానికొస్తే 65 ఇంచెస్ టీవీ ధర రూ. 2,19,990కాగా, 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ. 1,59,990గా నిర్ణయించారు.
🔍 ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ టీవీలో క్వాంటమ్ డాట్, నానోసెల్ అనే ప్రత్యేక టెక్నాలజీని అందిస్తున్నారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ డిస్ప్లే, డాల్బీ విజన్, ఆట్మోస్తో విజువల్ వండర్గా ఈ స్మార్ట్ టీవీని తీసుకొచ్చారు.
🎮 ఎల్జీ క్యూఎన్ఈడీ స్మార్ట్ టీవీలో 4కే రిజల్యూషన్తో డిస్ప్లేతో స్మార్ట్ డిమ్మింగ్ టెక్నాలజీని అందించారు. దీంతో దీంతో వీక్షకులు మరింత సహజమైన రంగుల్లో టీవలను వీక్షించవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
🎮🌈 ఇక ఈ స్మార్ట్ టీవీని గేమింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. గేమ్ డ్యాష్బోర్డ్, ఆప్టిమైజర్ను సపోర్ట్ చేయడం ఈ టీవీ ప్రత్యేకత. నెట్ఫ్లిక్స్, యాపిల్ టీవీ ప్లస్, డిస్నీ ప్లస్ హాట్స్టార్, ప్రైమ్ విడియో లాంటి ఓటీటీ ప్లాంట్ఫామ్లకు సపోర్ట్ చేస్తుంది. 🕹️📺✨