top of page

📱 రెడ్‌మీ కొత్త ఫోన్‌ ధరెంతో తెలుసా..?

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. రెడ్‌మీ నోట్‌ 13 ప్రో+ పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నారు.

📅 ఇక రెడ్‌ నోట్‌ 13 ప్రో+ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. మీడియా టెక్‌ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ ప్రాసెసర్‌తో వస్తున్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో ఐపీ68 రేటింగ్‌తో కూడిన వాటర్‌ రెసిస్టెంట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

📱 స్క్రీన్ విషయానికొస్తే ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. 1.5 కే రిజల్యూషన్‌, 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన స్క్రీన్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ను అందించారు.

📸 కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. 4కే రిజల్యూషన్‌తో కూడిన వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

🌏 చైనాలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ను జనవరి 4వ తేదీన లాంచ్‌ చేయనున్నారు. 💰 ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 23,500గా నిర్ణయించారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page