top of page

రాసలీలల తో రచ్చ కెక్కుతున్న ప్రభుత్వ పాఠశాల.🏫🎭

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి.. జ్ఞానాన్ని పంచి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దాల్సిన గురువులు తప్పుదోవ పడుతున్నారు. విద్యార్థుల జీవితాలకు మార్గనిర్దేశం చేయాల్సిన ఉపాధ్యాయులు రాసలీలల్లో మునిగి తేలుతూ విద్యా వ్యవస్థను అబాసుపాలు చేస్తున్నారు.

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి.. జ్ఞానాన్ని పంచి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దాల్సిన గురువులు తప్పుదోవ పడుతున్నారు. విద్యార్థుల జీవితాలకు మార్గనిర్దేశం చేయాల్సిన ఉపాధ్యాయులు రాసలీలల్లో మునిగి తేలుతూ విద్యా వ్యవస్థను అబాసుపాలు చేస్తున్నారు. ఉపాధ్యాయుల రాసలీలలు చూడలేక తల్లిదండ్రులకు చెబితే కేసులు పెడతాం అని వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో ఈ ఉపాధ్యాయులు మాకొద్దంటూ గ్రామస్థులు నిరసన తెలిపేవరకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా మోతే మండలం ఉర్లుగొండ ప్రభుత్వోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు అక్కడే పని చేసే ఉపాధ్యాయిని తో రాసలీలల్లో మునిగిపోవడం కలకలం రేపుతోంది. సదరు టీచర్ల వెకిలి చేష్టలతో విసిగిపోయిన విద్యార్థులు, గ్రామస్థులు ఆందోళన బాట పట్టారు. ఈ ఉపాధ్యాయులు మాకొద్దంటూ అల్టిమేటం ఇచ్చారు.గత నవంబర్‌లో ఇలాంటి చేష్టలు చేస్తున్న ఈ టీచర్స్ ఇద్దరినీ పేరెంట్స్ కమిటీ సమావేశంలో నిలదీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.. దీంతో నామమాత్రంగా మహిళా ఉపాధ్యాయినిని మరో చోటకు డెప్యుటేషన్‌పై పంపారు. కొద్ది రోజుల క్రితం తిరిగి ఆమె అదే పాఠశాలకు వచ్చారు. మళ్ళీ అసభ్యకరంగా ప్రవర్తించటం మొదలు పెట్టారు. దీంతో గ్రామస్థులందరూ వీరి ప్రవర్తన పై విసుగుచెంది ఆర్జేడీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, విచారణకు ఆదేశించారు. విచారణ బృందం వస్తారన్న సమాచారంతో సదరు ఉపాధ్యాయుల జంట… విద్యార్థులను వేధించడం మొదలు పెట్టారు. విద్యార్థులతో పాఠశాల మొత్తం ఊడిపించడం, నిజం చెబితే మీపై మీ తల్లిదండ్రుల పై కేసులు పెడతామని హెచ్చరించారు. అధికారుల విచారణలో హెడ్మాస్టర్, టీచర్ రాసలీలల వివరాలను వారికి చెప్పారు. ఈ ఉపాధ్యాయులు మాకొద్దని తీర్మానం చేసి, వారు తిరిగి వస్తే పాఠశాలకు తాళం వేస్తామని హెచ్చరించారు.🚫🧒


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page