top of page

తమిళ నటుడు పొన్నంబలం ఎమోషనల్ కామెంట్స్..

మెగాస్టార్ చిరంజీవి వల్లే ఇప్పుడుఇలా ప్రాణాలతో ఉన్నాను అన్నారు తమిళ నటుడు పొన్నంబలం. తనవరకూ..దేవుడు ఎలా ఉంటాడు అంటే.. చిరంజీవి రూపంలో ఉంటాడని చెపుతానంటున్నాడు.

ఎవరికైనా సమస్యల్లో ఉన్నా.. ప్రాణాలుపోయే పరిస్థితి వచ్చినా.. ఆసమయంలో తనను కాపాడిన వారిని దేవుడిగా కొలుస్తుంటారు. దేవుడే ఆ రూపంలో వచ్చాడని భావిస్తారు. ప్రస్తుతం చాలా మందికి దేవుడిలా మారారు మెగాస్టార్ చిరంజీవి. ఎంతో మంది జీవితాలలో వెలుగు నిపుతూ.. వారి ప్రాణాలు కాపాడుతూ.. అందగా నిలుస్తున్నారు. తాజాగా తన ప్రాణాలు కాపాడి తన దైవంలా మారారు మెగాస్టార్ అంటూ తమిళ నటుడు పొన్నం బలం అంటున్నారు. చిరంజీవి వల్లే తాను ప్రాణాలతో ఉన్నానన్నారు.

అన్నా వదినలు విషం పెట్టి చంపాలని చూశారు.. కిడ్నీలు రెండు పాడైపోయి.. మంచానపడ్డాడు తమిళ నటుడు, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పొన్నంబలం. ఇక తన పని అయిపోయింది అనకున్నారు. ఎవరు సాయానికి ముందుకు రాకపోవడంతో.. పొన్నంబలం ఆశలు వదలుకున్నారు. చివరి ప్రయత్నంగా మెగాస్టార్ చిరంజీవికి వేడుకున్నాడు తమిళ నటడు. ఇక వెంటనే స్పందించిన మెగాస్టార్ చిరు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న పొన్నంబలంకు లక్షల రూపాయల సాయం చేశారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విషయాన్ని కొన్ని నెలల క్రితం పొన్నంబలమే స్వయంగా మీడియాకు వెల్లడించారు ఇక తాజాగా ఈ విషయాన్న మరో సారి గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు పొన్నంబలం. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ చిరంజీవి చేసిన సాయం గురించి చెప్పుకొచ్చారు. తాను కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఉన్నపుడు తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న కొందరు డయాలసిస్‌ కోసం మాత్రమే సాయం చేశారని చెప్పారు. చికిత్సకు డబ్బులు లేక ఎంతో ఇబ్బందిపడ్డానని అన్నారు. ఓ రోజు తన అల్లుడు తనను ఆంజనేయస్వామి గుడికి తీసుకెళ్లాడని చెప్పారు. అక్కడ పూజ అనంతరం పూజారి చిరంజీవ, చిరంజీవ అన్నారని, ఆ సమయంలో తనకు చిరంజీవి పేరు గుర్తుకు వచ్చిందని తెలిపారు. చిరంజీవిని అడిగితే ఓ రెండు లక్షల వరకు సాయం చేస్తారేమోనని భావించానన్నారు. వెంటనే మిత్రుల ద్వారా ఆయనకు విషయం తెలియజేశానన్నారు పొన్నం బలం.

వెంటనే స్పందించి చిరంజీవి సాయం చేయటానికి ముందుకు వచ్చారని, రెండు లక్షలు ఇస్తారనుకుంటే ఏకంగా 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని సంతోషం వ్యక్తం చేశారు. ఆయన చేసిన సాయాన్ని ఈ జీవితంలో మర్చిపోలేనని చెప్పారు. అనారోగ్యంతో ఉన్న పొన్నంబలానికి చెన్నైలోని అపోలో హాస్పటల్ లో ట్రీట్మెంట్ చేయించారు చిరంజీవి. ఒక్క పైసా తీసుకోకుండా.. మొత్తం ట్రీట్మెంట్ చేసి.. పంపించారు వైద్యులు. దాదాపు 40 లక్షల వరకూ చికిత్సకు ఖర్చు అయినట్టు సమాచారం. దాంతో మెగా ఫ్యాన్స్ తమ అభిమాన స్టార్ నిజంగా దేవుడంటూ.. ఈన్యూస్ ను వైరల్ చేస్తున్నారు.

Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page