top of page

ఆ బోల్డ్ మూవీ సీక్వెల్ చేయబోతున్న తమన్నా..🎥✨

తమన్నా భాటియా మరోసారి ఓ తెలుగు మూవీలో నటించబోతోంది. గతేడాది బాలీవుడ్ తోపాటు టాలీవుడ్, కోలీవుడ్ లోనూ నటించిన ఈ మిల్కీ బ్యూటీ.. ఇప్పుడు ఓ క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్ కు ఓకే చెప్పింది.

తమన్నా భాటియా మరోసారి ఓ తెలుగు మూవీలో నటించబోతోంది. గతేడాది బాలీవుడ్ తోపాటు టాలీవుడ్, కోలీవుడ్ లోనూ నటించిన ఈ మిల్కీ బ్యూటీ.. ఇప్పుడు ఓ క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్ కు ఓకే చెప్పింది. 2022లో నేరుగా ఓటీటీలో రిలీజైన ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి ఇప్పుడు ‘ఓదెల 2’ పేరుతో సీక్వెల్ రాబోతోంది. ‘ఓదెల రైల్వే స్టేషన్’ మూవీలో హెబ్బా పటేల్ నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ లోనూ ఆమె నటించింది. ఇప్పుడీ సీక్వెల్ కు తమన్నా ఓకే చెప్పడంతో ఇందులో ఆమె ఎలాంటి సీన్స్ చేయబోతోందో అన్న ఆసక్తి నెలకొంది. అశోక్ తేజ డైరెక్షన్ లో ఈ థ్రిల్లర్ మూవీ ‘ఓదెల 2’ రానుంది. ఈ మధ్య కాలంలో స్క్రీన్ పై రెచ్చిపోయి నటిస్తోంది తమన్నా.కాలానికి తగినట్లుగా మనమూ మారాలని చెబుతూ ఆమె గతేడాది ‘లస్ట్ స్టోరీస్ 2’, ‘జీ కర్దా’ లాంటి సిరీస్ లలో తమన్నా బోల్డ్ సీన్స్ చేసింది. ఇప్పుడు ‘ఓదెల్ 2’ మూవీకి సరే అనడంతో ఇందులోనూ ఆమె అలాంటి సీన్స్ చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. 2023లో ఈ రెండు వెబ్ సిరీస్ లతోపాటు తమిళంలో ‘జైలర్’, తెలుగులో ‘భోళా శంకర్’ సినిమాల్లోనూ తమన్నా కనిపించింది.గతంలో ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’, ‘సీటీమార్’ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన సంపత్ నంది ఈ ‘ఓదెల 2’ మూవీకి క్రియేటర్ గా ఉండనున్నాడు. వీటిలో ‘రచ్చ’ మూవీలో తమన్నానే నటించింది.🎥✨


bottom of page