top of page
Suresh D

సెల్ఫీ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. 🤳📰

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో సెల్ఫీలు తీసుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇక ఈ సెల్ఫీలు తీసుకునేందుకు ప్రమాదకరమైన స్టంట్లు అన్నీ చేస్తున్నారు. చెట్లు, పుట్టలు, కొండలు, గుట్టలు, జంతువులు.. ఇలా ఏది కనబడితే దాంతో సెల్ఫీలు తీసుకునే వారిని మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఇలా సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదాల బారిన పడినవారు, ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్రూర జంతువులతో సెల్ఫీలు తీసుకునే వారికి షాక్ ఇచ్చింది. ఇక నుంచి క్రూర జంతువులతో సెల్ఫీలు దిగితే 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది.



bottom of page