top of page
MediaFx

ఆఫ్ఘ‌నిస్థాన్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం!

బార్బడోస్‌లోని కెన్సింగ్ట‌న్ ఓవల్ వేదిక‌గా టీ20 వరల్డ్ క‌ప్‌లో భాగంగా జ‌రిగిన సూప‌ర్‌-8 మ్యాచ్‌లో భార‌త్‌, ఆఫ్ఘనిస్థాన్ మ‌ధ్య ఘన విజయం సాధించింది. రోహిత్ సేన నిర్దేశించిన 182 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఆఫ్ఘ‌నిస్థాన్ 134 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 ప‌రుగులు చేసింది. మిస్ట‌ర్ 360 సూర్యకుమార్ యాదవ్ అర్ధ శ‌త‌కం (53)తో రాణించాడు. హార్దిక్ పాండ్యా (32) సమయోచితంగా ఆడి తోడ్పాటు అందించాడు. సూర్య 28 బంతుల్లో 5 బౌండ‌రీలు, 3 సిక్సుల సాయంతో 53 ప‌రుగులు బాదాడు. హార్దిక్ 24 బంతుల్లో (3 ఫోర్లు, 2 సిక్సులు) 32 ప‌రుగులు చేశాడు. కోహ్లీ 24, పంత్ 20 ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌నిపించారు. రోహిత్ శ‌ర్మ 8 ప‌రుగుల‌తో నిరాశపరిచారు. ఆఫ్ఘ‌నిస్థాన్ బౌల‌ర్ల‌లో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫరూఖీ చెరో 3 వికెట్లు ప‌డ‌గొట్టగా, నవీనుల్ హక్ 1 వికెట్ తీశాడు.

అనంత‌రం 182 ప‌రుగుల ల‌క్ష్య‌ఛేద‌నలో ఆఫ్ఘ‌న్ త‌డ‌బ‌డింది. 23 ప‌రుగుల‌కే 3 కీల‌క‌మైన వికెట్లు కోల్పోయింది. గుల్బ‌దీన్ నైబ్, అజ్మ‌తుల్లా కొద్దిసేపు ధీటుగా ఆడారు. ఈ ద్వ‌యం 44 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పింది. కానీ ఆ తర్వాత ఆఫ్ఘాన్ బ్యాట‌ర్లు వ‌రుస‌గా పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. బుమ్రా, అర్ష్‌దీప్ విజృంభించ‌డంతో 20 ఓవ‌ర్ల‌లో 134 ప‌రుగులు మాత్ర‌మే చేయగలిగారు. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా, అర్ష్‌దీప్ త‌లో 3 వికెట్లు తీసి, కుల్దీప్ 2, అక్ష‌ర్ ప‌టేల్, ర‌వీంద్ర జ‌డేజా చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. 53 ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాద‌వ్ 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు ద‌క్కించుకున్నాడు.

bottom of page