top of page

వేగంగా వెళ్తున్న రైలుపై రాళ్ల దాడి.. ప్రయాణికుడికి గాయాలు..


నడుస్తున్న రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడి ముక్కుకు గాయమైంది. బీహార్‌లోని భాగల్‌పూర్-జైనగర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. రాయి విసిరిన వ్యక్తిని ఎవరో రైళ్లోంచి ఫోటోలు, వీడియో తీశారు. ప్రస్తుతం అతని ఫోటో, దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాళ్లదాడి కారణంగా ప్రయాణికుడి ముక్కు నుండి రక్తం కారుతున్న ఫోటో కూడా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటోలో సమీపంలోని ఒక యువకుడు రైలుపై రాళ్లు రువ్వడం కనిపించింది. మరొక ఫోటోలో ముక్కుకు గాయంతో రైలు లోపల సీటుపై కూర్చున్న ప్రయాణీకుని చూపిస్తుంది. వీడియో క్లిప్‌తో పాటుగా ఉన్న నోట్‌లో దర్బంగా, కాకర్‌ఘాటి మధ్య రాళ్లదాడి జరిగిందని, రాయిని విసిరిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో పలువురు డిమాండ్ చేశారు. కాగా, ఈ పోస్ట్‌పై రైల్వే మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. ఈ ఘటనలో నిందితుడిని గుర్తించామని, అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. రైలుపై రాళ్లు రువ్వే సంఘ విద్రోహులపై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వేశాఖ కూడా స్పష్టం చేసింది.



Comentarios


bottom of page