top of page

ఒకే చోట అగ్ర దర్శకుడు, నటుడు ఎందుకో ? 🎥

ఒకే రోజు ఒకేచోట జరిగిన కార్యక్రమంలో పాన్ ఇండియా హీరో, రాకింగ్ స్టార్ స్టార్ యష్, పాన్ ఇండియా డైరెక్టర్ జక్కన్న రాజమౌళి పాల్గొన్నారు.

ఈ ఇద్దరూ ప్రముఖులు భారీ అంచనాలతో తెరకెక్కుతున్న రెండు వేర్వేరు సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. యష్ తదుపరి చిత్రం టాక్సిక్ సినిమా పనులతో చాలా బిజీగా ఉన్నాడు. ఇక బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన ఎస్.ఎస్.రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.రాజమౌళి, హీరో యష్ వారివారి పనులకు విరామం ఇచ్చి కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని బళ్లారికి ప్రయాణించారు. బళ్లారిలోని శ్రీ అమృతేశ్వరాలయ ప్రారంభోత్సవంలో రాజమౌళి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఇదే సమయంలో ఇదే ఆలయం ప్రారంభోత్సవానికి రాకింగ్ స్టార్ యష్ కూడా హాజరైనాడు. పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి ఆయన సతీమణి రమా రాజమౌళితో వచ్చి శ్రీ అమృతేశ్వరాలయ ప్రతిష్ఠను వీక్షించారు.🎥



bottom of page