top of page

దూకుడు పెంచిన శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ ప్రైవేట్ స్కూల్స్ పట్టణ అధ్యక్షురాలు మాధవి అనారోగ్యంతో సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

ఈ సమాచారం అందుకున్న మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు బుధవారం రాత్రి హాస్పిటల్ వెళ్లి ఆమెను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులకు సూచించారు. వైద్యం కోసం అన్ని విధాల అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివిధ కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొంటూ వార్తల్లో నిలుస్తున్నారు . అంతకు ముందు కూడా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిష్టియన్ పల్లికి చెందిన శోభారాణికి నిమ్స్ లో వైద్యం కోసం రూ. 2 లక్షల విలువైన ఎల్వోసీ ప్రొసీడింగ్స్ కాపీని అందచేశారు శ్రీనివాస్ గౌడ్ . అలాగే మహబూబ్ నగర్ రూరల్ మండలం ఓబ్లాయపల్లిలో జరిగిన బొడ్రాయి, బోనాల పండుగకు హాజరై సందడి చేశారు .



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page