ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ కొత్త సేల్తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. అటు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్స్ పేరుతో మే 2 నుంచి ప్రారంభిస్తోంది. కాగా ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరుతో సేల్ను నిర్వహిస్తున్నారు. మే 3వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఈ సేల్లో స్మార్ట్ ఫోన్స్పై భారీ డిస్కౌంట్స్ను అందిస్తున్నాయి. ఇంతకీ ఈ సేల్లో ఏయే ఫోన్స్పై ఎలాంటి డిస్కౌంట్స్ లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మే 9వ తేదీ వరకు కొనసాగనున్న ఫ్లిప్కార్ట్ సేల్లో భాగంగా పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్స్తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ను అందిస్తున్నాయి. సేల్లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 సిరీస్ ఫోన్లపై, ఐప్యాడ్లపై , శాంసంగ్ ట్యాబ్లెట్లపై డిస్కౌంట్స్ను అందిస్తున్నారు.
యాపిల్ ఐప్యాడ్ 10 జెన్ ట్యాబ్ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ట్యాబ్ అసలు ధర రూ. 36,900గా ఉండగా బ్యాంకు ఆఫర్లు, ఫ్లిప్కార్ట్ ఆఫర్తో కలుపుకుంటే రూ. 30వేల లోపే సొంతం చేసుకోవచ్చు. ఇక సామ్సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ ఎస్9తో పాటు వన్ప్లస్ ట్యాబ్పై కూడా భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఇందులో భాగంగా రూ. 30వేల లోపే ఈ ట్యాబ్ను సొంతం చేసుకోవచ్చు. గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్ రూ. 20 వేల కంటే తక్కువకే లభిస్తుంది.
సామ్సంగ్ ఎస్23 స్మార్ట్ ఫోన్పై కూడా భారీ ఆఫర్ అందిస్తున్నారు. ఈ ఫోన్పై అన్ని రకాల ఆఫర్లను కలుపుకుంటే రూ. 45 వేల కంటే తక్కువకే లభించనుంది. గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈ కూడా 40 వేల కంటే తక్కువకు లభిస్తుంది. ఇక మోటో ఎడ్స్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ను డిస్కౌంట్లో భాగంగా రూ. 28,000 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అలాగే మోటోరోలా ఎస్ 40 నియో రూ. 20 వేల కంటే తక్కువకే లభిస్తుంది.