top of page

మూకుమ్మడి రాజీనామాలతో 🚶‍♂️📝 పార్టీ వీడుతున్న సిరిసిల్ల కాషాయ దళం! 🎉

🔸 సిరిసిల్ల టికెట్ కోసం ఇద్దరు, ముగ్గురు బీజేపీ నేతలు పోటీ పడ్డారు. 🔸 అయితే.. స్థానికులకు కాకుండా రాణిరుద్రమకు టికెట్ కేటాయించింది బీజేపీ అధిష్టానం. 🔸

దీంతో స్థానిక నేతలందరూ మూకుమ్మడిగా అధిష్టానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 🔸 టికెట్ ఆశించిన.. లగిశెట్టి శ్రీనివాస్. 🔸 రమకాంత్, అన్నలదాసు వేణు, బీజేపీకి గుడ్‌బై చెప్పారు. 🔸 రమాకాంత్, కేటిఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిపోయారు. 🔸 అదే విధంగా… మిగతా నేతలు పార్టీలో ఉన్నా సైలెంట్ అయ్యారు.

🗳️ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పటికీ సిరిసిల్ల నియోజకవర్గంలో అసంతృప్తులు ఏమాత్రం చల్లారడం లేదు. 🔸 ఇక్కడంతా జరుగుతున్నా, అధిష్టానం మాత్రం జోక్యం చేసుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 🔸 ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే.. అనేక కేసులు పెట్టారని, ఇప్పుడు కొత్త వారికి టికెట్ ఎలా ఇస్తారని.. అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. 🔸 ఇక పార్టీలో ఉన్న నేతలు సైతం ప్రచారంలో కలిసిరావడం లేదు. 🔸 దీంతో… బీజేపీ ముఖ్య నేతలకు ఇబ్బందిగా మారింది. 🔸 కొంత మంది నేతలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌‌ను కలిసి తమ బాధను విన్నవించారు. 🔸 అయినప్పటికీ.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు. 🔸 అందరిని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అసమ్మతి నేతలు మాత్రం ఎవరికైనా, స్థానికుడికి మాత్రమే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే.. పార్టీలో ఉండలేమని.. తేల్చి చెబుతున్నారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page