top of page

భారత్‌పై సింగర్‌ మిక్‌ జాగర్‌ ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ..

మిక్‌ జాగర్ చేసిన ఈ ట్వీట్‌పై.. ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మిక్‌ చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన ప్రధాని. ఈ ట్వీట్‌లో ‘మీరు కోరుకున్న ప్రతిదీ పొందలేక పోవచ్చు..

కానీ భారతదేశం మాత్రం ఎంతో మంది అన్వేషకులతో నిండి ఉంటుంది. ఇక్కడ అందరికీ ఓదార్పు, సంతృప్తి లభిస్తుంది. మీరు ఇక్కడి ప్రజలు, సంస్కృతిలో ఆనందాన్ని పొందారని తెలుసుకోవడం ఆనందంగా ఉంది. భారత్‌కు ఇలాగే ఎప్పుడూ వస్తూ ఉండండి’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం మోదీ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఇక మిక్‌ జాగర్ విషయానికొస్తే.. రాక్‌ సంగీ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వారిలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. సుమారు 60 ఏళ్లుగా సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్నారు. 1943లో జన్మించిన మిక్‌ జాగర్‌ కేవలం గాయకుడిగానే కాకుండా సాంగ్ రైటర్‌, యాక్టర్‌, ఫిల్మ్‌ మేకర్‌, డ్యాన్సర్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. 🎤👏


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page