కేరళలోని కొచ్చిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తనకు పుట్టిన శిశువును కవర్లో చుట్టి అపార్ట్మెంట్ భవనం నుంచి ఓ యువతి రోడ్డుపైకి విసిరేసింది. దీంతో గాయాలపాలైన ఆ శిశువు ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. కోచి పనంపిల్లే నగర్లోని విద్యానగర్లో ఎంబీఏ విద్యార్థిని (24) వనిష్క అపార్ట్మెంట్ బాత్రూమ్లో శుక్రవారం తెల్లవారుజామున ఓ బిడ్డను ప్రసవించింది. ఆ విషయం తన తల్లిదండ్రులకు తెలియకూడదని భావించిన ఆమె.. అమెజాన్ పార్సిల్ కవర్లో శిశువును చుట్టి అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి బయటకు విసిరేసింది. ఈ క్రమంలో రోడ్డుపై పడిన ఆ నవజాత శిశువు చనిపోయింది. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో కొందరు మున్సిపల్ కార్మికులు పార్సిల్ కవర్లో ఉన్న శిశువు మృతదేహాన్ని చూసి షాకయ్యారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు... విచారణ చేపట్టారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా.. వనిష్క అపార్ట్మెంట్ భవనంపై నుంచి ఓ యువతి పార్సిల్ కవర్ను విసిరేస్తున్నట్టు కనిపించింది. అమెజాన్ పార్సిల్ కవర్పై ఉన్న అడ్రస్ ఆధారంగా పోలీసులు ఆమెను గుర్తించారు.
అయితే, అపార్ట్మెంట్ వాసులు మాత్రం తమ కాంప్లెక్స్లో 21 కుటుంబాలు ఉన్నాయని, వారిలో ఎవరూ గర్బిణిలు లేరని చెబుతున్నారు. ఇంతకు ముందు గర్భిణి మహిళలు ఉన్న మూడు కుటుంబాలు ఖాళీచేసి వెళ్లిపోయారని అంటున్నారు. ఆమె బయట నుంచి వచ్చిన మహిళగా పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి సమాచారం వెల్లడవుతుందని పోలీసులు పేర్కొన్నారు. శిశువు విసిరేసిన మహిళపై హత్య కేసు నమోదుచేసినట్టు తెలిపారు. అత్యాచారానికి గురైన యువతి.. గర్బం దాల్చినట్టు అనుమానిస్తున్నారు.