top of page

యూట్యూబ‌ర్‌ను కాల్చి చంపిన సెక్యూరిటీ గార్డు..?

న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో ఆదివారం భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్ సంగతులు పక్కనబెడితే, లాహోర్‌లో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

సాద్ అహ్మద్ అనే యూట్యూబర్, భారత్, పాక్ మ్యాచ్‌కు సంబంధించిన ప్రజాభిప్రాయాలను సేకరించాలనుకుని, కరాచీలోని మొబైల్ మార్కెట్‌కు వెళ్లాడు. అక్క‌డ ప‌లువురు షాప్ య‌జ‌మానుల నుంచి వీడియో బైట్‌ల‌ను తీసుకున్నాడు. అక్క‌డే ఉన్న సెక్యూరిటీ గార్డు అభిప్రాయాన్ని తీసుకోవాల‌ని భావించాడు. సెక్యూరిటీ గార్డు ఈ ప‌రిస్థితిని ఇష్టపడలేదు.

యూట్యూబ‌ర్ సాద్ అహ్మద్ మొబైల్ మార్కెట్‌లో షాప్ య‌జ‌మానుల నుండి వీడియో బైట్‌లు తీసుకొని, సెక్యూరిటీ గార్డును ఇంట‌ర్వ్యూ చేసేందుకు ప్రయత్నించాడు. పలు ప్రశ్నలు అడగడంతో సెక్యూరిటీ గార్డు కోపంతో త‌న తుపాకీతో సాద్ పై కాల్పులు జరిపాడు.

చుట్టూ ఉన్నవారు సాద్‌ను ఆస్పత్రికి తరలించారు కానీ అప్పటికే అతడు మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి సదరు సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్నారు. మైక్‌ను ముఖానికి దగ్గరగా ఉంచి, చిత్రీకరిస్తుండడంతో తాను స‌హ‌నం కోల్పోయాన‌ని, అందుక‌నే కాల్పులు జ‌రిపిన‌ట్లు సెక్యూరిటీ గార్డు చెప్పినట్లు సమాచారం.

సాద్ మరణం అతని కుటుంబానికి పెద్ద దెబ్బ. అతని సంపాదనపై ఆధారపడిన కుటుంబం లోటును భరించలేకపోతున్నారు. అతడు వివాహితుడు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్లు అతని స్నేహితుడు చెప్పారు. ఈ ఘటన యూట్యూబ్ కమ్యూనిటీ మరియు ప్రజలందరినీ తీవ్రంగా కలచివేసింది.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page