శర్వానంద్ నటించిన "మనమే" చిత్రం ఈ శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది! శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటించింది. నిన్న రాత్రి హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది.
సినిమా వివరాలు చెప్పే ముందు, ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణలకు శర్వానంద్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
🗨️ "పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి ఘన విజయం సాధించడం తో పండగ వాతావరణం నెలకొంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారికి నా శుభాకాంక్షలు. పిఠాపురంలోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దామనుకున్నాం కానీ పర్మిషన్ దొరకలేదు. సక్సెస్ మీట్ మాత్రం పిఠాపురంలోనే జరగాలి. ఎందుకంటే మొదటి పార్టీ మనదే కావాలి!" శర్వానంద్ ఉత్సాహంగా చెప్పారు.
సినిమా గురించి చెప్తూ శర్వానంద్, "ఎందుకు సీరియస్ సినిమాలు చేస్తున్నావని చాలా మంది అడుగుతున్నారు. అందుకే మంచి కథతో పాటు ఎంటర్టైన్మెంట్తో కూడిన సినిమా చేయాలనుకున్నాను. 'మనమే' ఒక అందమైన పాయింట్తో నడిచే చిత్రం. చివరి 40 నిమిషాలు మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. ఎలాంటి మెసేజ్లు ఉండవు. లాజిక్లు వెతకకండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మాత్రమే ఈ సినిమా చేశాం. సినిమా హిట్ అయితే క్రెడిట్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యకి. కాదు అంటే నాపైనే. ఇప్పుడు నేను ఏం చెప్తా. చేసి చూపిస్తా. ఇక నుంచి మీరు కొత్త శర్వాను చూస్తారు," అన్నారు.
నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, శర్వానంద్కి 'చార్మింగ్ స్టార్' బిరుదు ఇచ్చారు. కృతి శెట్టి, "శర్వానంద్ నటనకి ఫిదా అయ్యా. కథ విన్నప్పుడు ఎలా అనిపించిందో ఔట్ కమ్ చూశాక కూడా అదే ఫీలింగ్ కలిగింది," అన్నారు.
ఈ ఈవెంట్లో డైరెక్టర్లు మారుతి, సాయి రాజేశ్, శివ నిర్వాణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.