top of page
MediaFx

నా కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది: సమంత

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. టాలీవుడ్‌లో పెద్దగా సినిమాలేమీ లేకపోయినా బాలీవుడ్ సహా వెబ్ సిరీస్‌పై దృష్టి పెట్టింది. హాలీవుడ్ టీవీ సిరీస్ "సిటాడెల్"లో కూడా సమంత నటిస్తుంది. తాజాగా ఐఎండీబీ విడుదల చేసిన 'టాప్‌ 100 మోస్ట్‌ వ్యూడ్ ఇండియన్‌ స్టార్స్‌' జాబితాలో సమంత 13వ స్థానాన్ని దక్కించుకుంది.

ఓ ఇంటర్వ్యూలో సామ్ మాట్లాడుతూ, "ఐఎండీబీ జాబితాలో 13వ స్థానాన్ని సాధించడం ఆనందంగా ఉంది. ఇది నా కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావిస్తున్నా. ఒక్కోసారి కెరీర్‌ను ఇప్పుడే మొదలుపెట్టినట్లుగా అనిపిస్తుంది. సమయం ఎప్పుడు గడిచిందో తెలియదు. ప్రస్తుతం గొప్ప అవకాశాలు వస్తున్నాయి. మరింత కష్టపడి పనిచేస్తా" అని చెప్పింది.

కొత్త హీరోయిన్ల రాకతో పోటీ పెరిగిందా అని అడిగిన ప్రశ్నకు, "ప్రతి రంగంలోనూ పోటీ ఉంటుంది. ఆరోగ్యకరమైన పోటీ మంచిదే. అది ఆలోచనాశక్తిని పెంచుతుంది. నాతోటి హీరోయిన్లను చూసి స్ఫూర్తి పొందుతుంటాను. వారి విజయాలను చూసి మరింత కష్టపడి పనిచేయాలని అనిపిస్తుంది. అందుకే పోటీని నేనెప్పుడూ నెగెటివ్‌గా చూడను" అని సమంత తెలిపింది.

సమంత ప్రస్తుతం "మా ఇంటి బంగారం" అనే చిత్రంలో నటిస్తుంది, దీనికి ఆమె స్వీయ నిర్మాత. "ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌"పై రూపొందుతున్న తొలి చిత్రం ఇది. గతేడాది సెప్టెంబరులో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమాతో అలరించింది. వెబ్ సిరీస్ "సిటాడెల్"తో త్వరలోనే అలరించబోతుంది, ఇది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

bottom of page