top of page

రామ్ చరణ్ జోడిగా సాయి పల్లవి...🌟💑

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ నటిస్తోన్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. అలాగే మరో పాత్రలో హీరో విజయ్ సేతుపతి కనిపించనున్నాడని సమాచారం. తాజాగా ఇప్పుడు ఈ మూవీ గురించి మరో ఆసక్తికర వార్త వైరలవుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో చరణ్ జోడీగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కనిపిచనుందట. అయితే ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుండగా.. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. అయితే ఒకవేళ ఇదే నిజమైతే.. చరణ్, సాయి పల్లవి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతారు. 🎬❤️

ప్రస్తుతం చరణ్ మాత్రం గేమ్ ఛేంజర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆర్సీ16 ఎప్పుడూ పట్టాలెక్కుతుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గతంలో ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత హీరోయిన్ కృతి సనన్ కనిపిచనుందని టాక్ నడిచింది. ఇప్పుడు సాయి పల్లవి పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇందులో ఎవరు కనిపించనున్నారనేది తెలియాల్సి ఉంది. 🎭🌟


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page