ఐపీఎల్ 2024 (IPL 2024) 52వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మే 4న ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. గుజరాత్ జట్టు బెంగళూరు హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీని ఢీ కొట్టనుంది. దీంతో గత ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని, ప్లేఆఫ్కు వెళ్లాలనే దాని ఆశలను బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. మరోవైపు ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్ రౌండ్కు దాదాపుగా నిష్క్రమించింది.
IPL 2024లో ఈ రెండు జట్లు తమ మొదటి మ్యాచ్ ఆడిన సమయంలో, RCB జట్టు గుజరాత్ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పరుగులకే 200 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు గుజరాత్ జట్టు తన మునుపటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.
బెంగళూరు వర్సెస్ గుజరాత్ మధ్య గణాంకాలు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ మధ్య ఇప్పటివరకు మొత్తం 4 మ్యాచ్లు జరగగా, ఇందులో ఇరు జట్లు తలో 2 మ్యాచ్లు గెలిచాయి. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య పోటీ సమంగా నిలిచింది. ఈ క్రమంలో గెలిచిన జట్టు ఆధిపత్యాన్ని పొందుతుంది.ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. బెంగళూరులో శుక్రవారం భారీ వర్షం కురిసింది, శనివారం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం.